Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 34

Viswamitra's Lineage !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

బాలకాండ
ముప్పది నాలుగవ సర్గము
( విశ్వామిత్రుని జన్మ వృత్తాంతము)

కృతోద్వాహే గతే తస్మిన్ బ్రహ్మదత్తే చ రాఘవ |
అపుత్రః పుత్రలాభాయ పౌత్రీం ఇష్టిమకల్పయత్ ||

తా|| ఓ రామా ! బ్రహ్మదత్తుడు వివాహము చేసికొని వెళ్ళిపోయిన పిమ్మట. పుత్రులు లేని వాడైన ఆ శుకనాభుడు , పుత్రలాభము కొఱకు పుత్రకామేష్టి యాగమును ఆచరించెను.

Oh Rama when Brahmadatta left after marriage , Sukanaabha who has no sons performed a sacrifice by name "Putrakameshti" to obtain sons.

ఇష్త్యాంతు వర్తమానాయాం కుశనాభ మహీపతిమ్ |
ఉవాచ పరామోదారః కుశో బ్రహ్మసుతస్తదా ||
పుత్రస్తే సదృశః పుత్త్ర భవిష్యతి సుధార్మికః |
గాధిం ప్రాప్యసి తేన త్వం కీర్తిం లోకే చ శాశ్వతీమ్ ||
ఏవముక్త్వా కుశో రామ కుశనాభం మహీపతిమ్ |
జగామాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనమ్ ||

తా|| ' ఆ ఇష్టి కార్యక్రమము జరుగుచున్నప్పుడు పరమ ఉదారుడు , బ్రహ్మ సుతుడు అయిన కుశుడు కుశనాభ మహారాజు తో ఇట్లనెను. " నీతో సమానమైన ధార్మికుడగు పుత్రుడు , గాధి అను పేరుగలవాడు పుట్టును. అతని వలన నీ కీర్తి ప్రతిష్ఠలు శాశ్వతముగా నుండును". ఓ రామా ! కుశుడు ఈ విధముగా మహీపతి అయిన కుశనాభునికి చెప్పి ఆకాశమార్గముద్వారా సనాతనమైన బ్రహ్మలోకమునకు పోయెను.

కస్యచిత్త్వథ కాలస్య కుశనాభస్య ధీమతః |
జజ్ఞే పరమ ధర్మిష్ఠో గాధిరిత్యేవ నామతః ||
స పితా మమ కాకుత్ స్థ గాధిః పరమధార్మికః |
కుశవంశ ప్రసూతోsస్మి కౌశికో రఘునందన ||

తా|| కొంతకాలము పిమ్మట జ్ఞాని అయిన కుశనాభునకు పరమ ధార్మికుడు, గాధి అను పేరుగల పుత్రుడు జన్మించెను .ఓ రఘునందనా ! ఆ గాధి అనబడు ఆకాకుత్ స్థుడు పరమ ధార్మికుడు నా తండ్రి. నేను కుశవంశమున జన్మించితిని అందువలన కౌశికుడు అనబడువాడను.

పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రతా |
నామ్నా సత్యవతీ నామ ఋచీకే ప్రతిపాదితా ||
స శరీరా గతా స్వర్గం భర్తారం అనువర్తినీ |
కౌశికీ పరమోదారా ప్రవృత్తా చ మహానదీ ||
దివ్యా పుణ్యోదకా రమ్యా హిమవంతం ఉపాశ్రితా |
లోకస్య హితకామార్థం ప్రవృతా భగినీ మమ ||
తతోsహం హిమత్పార్శ్వే వసామి నిరతః సుఖమ్ |
భగిన్యాం స్నేహసంయుక్తః కౌశిక్యాం రఘునందన ||

తా|| ఓ రాఘవా ! నా అక్క సత్యవతి అను పేరుగలది , వ్రత నిష్ఠగలది. ఆమెకి ఋచీకునితో పెండ్లి జరిగెను. కౌశికీ అనబడు ఆమె భర్తను అనుసరించి శరీరముతో స్వర్గము చేరెను. పరమోదారయగు ఆమె కౌశికీ అనబడు పేరుతో మహనదియై ప్రవహించుచుండెను. దివ్యమైన రమ్యమైన పుణ్యోదకములుగల ఈ నది హిమగిరిని ఆశ్రయించెను. లోకహితము కొఱకై నా సోదరి నదివలె ప్రవహించుచున్నది. ఓ రఘునందనా ! అందువలన నా సోదరియైన కౌశికపై గల ప్రేమతో ఈ హిమాలయప్రాంతమున నేను సుఖముగా నివశించుచున్నాను.

సా తు సత్యవతీ పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠితా |
పతివ్రతా మహాభాగా కౌశికీ సరితాం వర ||
అహం హి నియమద్రామ హిత్వా తాం సముపాగతః |
సిద్ధాశ్రమమనుప్రాప్య సిద్దోs స్మి తవ తేజసా ||
ఏషా రామ మమోత్పత్తిః స్వస్య వంశస్య కీర్తితా |
దేశస్య చ మహాబాహో యన్మాం త్వం పరిపృఛ్ఛసి ||
గతోsర్ధరాత్రః కాకుత్ స్థ కథాః కథయతో మమ |
నిద్రామభ్యేహి భద్రం తే మాభూద్విఘ్నోsధ్వనీహ నః ||

తా|| ఆ సత్యవతి పవిత్రురాలు . సత్యము ధర్మము ఆమెకు ప్రాణతుల్యములు ఆమె పతివ్రత. మహాత్మురాలు. ఆకౌశికీ నదులలో శ్రేష్ఠమైనది. ఓ రామా ! నేను ఆ క్రతువు నిర్వహించుటకు ఆ ప్రాంతమునుండి ఇచటికి వచ్చితిని. సిద్ధాశ్రమమునకు వచ్చి నీ పరాక్రమముచే కృతార్థుడనైతిని.ఓ మహాబాహో ! నీవు అడుగుటవలన ఈ దేశము గురించి , మా వంశకీర్తి , నా పుట్టు పూర్వోత్తరములు చెప్పబడడమైనది. ఈ కథా ప్రసంగములతో రాత్రిలో సగభాగము గడిచినది. మనప్రయాణమునకు విఘ్నములేకుండుటకు ఇక నిద్రింపుము.నీకు శుభమగును'.

నిష్పందాః తరవస్సర్వే నిలీనా మృగపక్షిణః |
నైశేన తమసా వ్యాప్తా దిశశ్చ రఘునందన ||
శనైర్వియుజ్యతే సంధ్యా నభో నేత్రైరివావృతమ్ |
నక్షత్ర తారాగహనం జ్యోతిర్భిరవభాసతే ||
ఉత్తిష్ఠతి చ శీతాంశుః శశీ లోకతమోనుదః |
హ్లాదయన్ ప్రాణీనాం లోకే మవాంసి ప్రభయావిభో ||
నైశాని సర్వభూతాని ప్రచరంతి తతస్తతః |
యక్షరాక్షస సంఘాశ్చ రౌద్రాశ్చ పిశితాశనాః ||

తా||'ఓ రఘునందనా ! చెట్లు కదలుటలేదు.మృగములు పక్షులు నిద్రలో లీనమై ఉన్నాయి. చీకటి నలుదిశలా వ్యాప్తమైయున్నది. మెల్లిగా సంధ్యా కాలము గడిచినది. నక్షత్ర తారాగణములతో నిండిన ఆకాశము జ్యోతిర్మయములైన నేత్రములతో ఉన్నదానివలె ప్రకాశించుచున్నది. ఓ రామచంద్రా ! చంద్రుడు తన చల్లని కిరణములతో చీకట్లను తీసివేసి లోకములకు ఆహ్లాదము కలగచేయుచున్నాడు. యక్ష రాక్షస సంఘములు , రౌద్రులు , పిశాచరులూ నిశిరాత్రిలో చరించు ప్రాణులన్నియూ అటునిటు తిరుగాడుచున్నవి'.

ఏవముక్త్వా మహాతేజా విరరామ మహామునిః|
సాధు సాద్వితి తం సర్వే మనయో హ్యభ్యపూజయన్ ||
కుశికానామ్ అయం వంశో మహాన్ ధర్మపర స్సదా |
బ్రహ్మోపమా మహాత్మానః కుశవంశ్యా నరోత్తమాః ||
విశేషేణ భవానేన విశ్వామిత్రో మహాయశాః |
కౌశికీ సరితాం శ్రేష్ఠా కులోద్యోతకరీ తవ ||
ఇతితైర్మునిశార్దూలైః ప్రశస్తః కుశికాత్మజః |
నిద్రాముపాగమత్ శ్రీమాన్ అస్తం గత ఇవాంశుమాన్ ||

తా|| ఈ విధముగా చెప్పి మహాతేజోవంతుడైన ఆ మహాముని విరమించెను. పిమ్మట ఆ మునులందరూ "బాగు" "బాగు" అని ఆ మహామునిని ప్రస్తుతించిరి. "ఓ మునీ కుశికులయొక్క ఈ వంశము చాలా గొప్పది. ఇది ధర్మమునకు ఆటపట్టు. కుశివంశములో అందరూ నరోత్తములు బ్రహ్మతో సమానమైన మహానుభావులు. మహా యశస్వి అయిన విశ్వామిత్రా ! విశేషముగా మీరు ఇంకనూ గొప్పవారు, కౌశికీ నది అన్ని నదులలో ఉత్తమమైనది". ఈ విధముగా అ మునీశ్వరులందరూ ప్రస్తుతించగా మిక్కిలి సంతుష్ఠుడైన కౌశికుడు అస్తాద్రిని చేరిన సూర్యునివలె నిద్రకు ఉపక్రమించెను.

రామోs పి సహ సౌమిత్రిః కించిదాగత విస్మయః |
ప్రశస్త్య మునిశార్దూలం నిద్రాం తముపసేవతే ||

తా|| అంతట ఆరామలక్ష్మణులిద్దరూ కూడా కొంత ఆశ్చర్యపోయి ఆ మునిశార్దులమగు విశ్వామిత్రుని ప్రస్తుతించి నిద్రలో మునిగిరి.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే చతుస్త్రింశస్సర్గః ||
సమాప్తం ||

||ఈ విధముగా వాల్మీకి రామాయణములో ని బాలకాండలో ముప్పది నాలుగవ సర్గ సమాప్తము ||
|| ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||